వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యం పదిలం; ఈఓఆర్డి శ్రీహరి

వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యం పదిలం; ఈఓఆర్డి శ్రీహరి

ప్రపంచ టాయిలెట్స్ దినోత్సవ సందర్భంగా స్వచ్ఛభారత్ కార్మికులకు సన్మానం.

 కేజీబీవీ నందు పిల్లలకు అవగాహన కార్యక్రమం.

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: వ్యక్తిగత పరిశుభ్రత తోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని తుగ్గలి మండల ఈఓఆర్డి శ్రీహరి తెలియజేశారు.ప్రపంచ టాయిలెట్స్ దినోత్సవం సందర్భంగా మంగళవారం రోజున తుగ్గలి మండలంలోని తుగ్గలి,రాతన మరియు చెన్నంపల్లి గ్రామ సచివాలయంలోను మండలంలోని కస్తూరిబా గాంధీ ఆశ్రమ పాఠశాలలోని పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థినీల సమక్షంలో తుగ్గలి మండల ఈఓఆర్డి శ్రీహరి నేతృత్వంలో ప్రపంచ టాయిలెట్స్ దినోత్సవాన్ని నిర్వహించారు.అనంతరం చేతులు పరిశుభ్రత గురించి తెలియజేశారు. భోజనం చేసేముందు చేతులను పరిశుభ్రంగా శుభ్రపరచుకోవాలని ఆయన తెలియజేశారు.ఈ సందర్భంగా ఈఓఆర్డి శ్రీహరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను వినియోగించుకోవాలని ఆయన తెలియజేశారు.మన శరీర శుభ్రతతో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,మనం వినియోగించే వస్తువులు కూడా పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని ఆయన తెలియజేశారు. రాతన గ్రామంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులను గ్రామానికి చేస్తున్న సేవలకు గాను వారికి పూల మాలలు వేసి శాలువాతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో తుగ్గలి సర్పంచ్ రవి, పంచాయతీ కార్యదర్శి లు రామకృష్ణ, శివ,ఎంపీటీసీ రాజు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ రాజేష్,ఏఎన్ఎం మహాలక్ష్మి,రాతన గ్రామ సచివాలయం సిబ్బంది,అక్బర్,కోటేష్ గౌడ్,గ్రామ ప్రజలు,చెన్నంపల్లె గ్రామ సచివాలయం సిబ్బంది గ్రామ ప్రజలు,మరియు కస్తూరిబా గాంధీ ఆశ్రమ పాఠశాలలోని సిబ్బంది,విద్యార్ధిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!