పెనికలపాడు గ్రామంలో పొలము పిలుస్తోంది కార్యక్రమం

పెనికలపాడు గ్రామంలో పొలము పిలుస్తోంది కార్యక్రమం

మండల వ్యవసాయ అధికారి మా రెడ్డి వెంకటకృష్ణారెడ్డి

ముద్దనూరు, న్యూస్ వెలుగు; ముద్దనూరు మండలము లోనిపెనీకలపాడు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి.వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో సాగు చేసిన కంది,మినుము పంటలను పరిశీలించి రైతులకు తగు సూచనలు సలహాలు ఇచ్చినట్లు తెలిపారు.ముఖ్యంగా కంది పంట మొగ్గ, పూత దశలో ఉంది అని రసం పీల్చే పురుగుల నివారణకు మరియు లద్దేపురుగు ఉధృతి ని నివారించుటకు వేప నూనె5 యమ్.యల్. మరియు అసిఫెట్ 1.5గ్రాములు చొప్పున లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు.అలాగే మినుము పంటలో పల్లాకు తెగులు మొక్కలు కనిపిస్తే వెంటనే పీకి వేసి ఏరి వేసి కాల్చివేయాలి అని తెలిపారు.రైతులు వ్యవసాయ శాఖ అధికారులు సిపారస్ చేసిన మేరకు క్రిమిసంహారక మందులు సూచించిన పరిమాణంలో వాడుకోవాలని తెలిపారు. శనగ పంట లో వేరు కుళ్లు తెగులు నివారణకు హెక్సాకొనోజోల్ అనే మందును 2 యమ్.యల్ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలని తెలిపారు.లేదా ప్రొపి కొనజోల్ ఒక యమ్.యల్.మరియు 19.19.19 10 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి అని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ వి ఏ ఏ పవన్ కుమార్ గ్రామ నాయకులు కె.శివ ప్రసాద్ మరియు వెంకట స్వామి రెడ్డి,మల్లికార్జున తదితర రైతులు గ్రామ నౌకరు మాధవి పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!