విద్యా వ్యాపారంగా మారింది.. అధికారులు చోద్యం చూస్తున్నారు

విద్యా వ్యాపారంగా మారింది.. అధికారులు చోద్యం చూస్తున్నారు

కర్నూలు, న్యూస్ వెలుగు; విద్యా వ్యాపారంగా మారిందని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ విమర్శించారు . బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్య పేరుతో పలు ప్రైవేట్ విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారని , విద్యార్థుల తల్లిదండ్రులు చితికి పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పలు లాభదాయకమైన వ్యాపారాల్లో విద్య ఒకటిగా మారిందని, దీనికి కారణం ప్రభుత్వమే అన్నారు. పలు విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూళ్లు చేస్తున్న జిల్లా ఉన్నతాధికారులు ఏసీ రూములు నుండి బయటపడటం లేదని ఆయన విమర్శించారు. కనీసం విద్యాశాఖ తనిఖీలు చేస్తున్న దాఖలాలు లేవని, కేవలం పేపర్ పులులుగా మారుతున్నారని తప్ప ఆచరణలో పెట్టడం లేదన్నారు. పలు విద్య సంస్థలలో క్రీడా మైదానాలు లేవని, లైబ్రరీ లేవని ..ఉన్న వినియోగించడం లేదని పలువురు విద్యార్థులు తమ దృష్టికి తీసుకుని వచ్చారని అని తెలిపారు . విద్యార్థులు ఫలితాలు ఎంత ముఖ్యమో పిల్లల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం అన్నారు . ఈ విషయాన్ని విస్మరించడం సరికాదన్నారు. నాణ్యమైన విద్యను కోరుకునే మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి పెరిగిపోతుందని, ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తున్న సరైన సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల ప్రచారం ప్రచారాలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది మేధావులు రాష్ట్రానికి దేశానికి సేవలు అందించారని అటువంటి ప్రచారం లోపం ఉందని సమాచార శాఖ అలంకారప్రాయంగా మాత్రమే ఉందన్నారు .మంచి విద్య అనేది మధ్యతరగతి భరించలేని విలాపం గా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంస్థలు ఒక వాణిజ్య సంస్థగా మారుతున్నాయని, సమాజానికి కీడు కలిగించేలా ఉన్నాయని ఇప్పటికి కూడా అమ్మబడి నిధులు కేటాయించకపోవడం బాధాకర విషయం అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!