
గుడిసె దగ్ధం..5 లక్షల ఆస్తి నష్టం
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు : మండలంలోని జీసీ పాలెం గ్రామంలో ప్రమాదవశాత్తు పూడి గుడిసే దగ్ధమై బంగారం నగదు అగ్నికి ఆహుతైన సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. బాధితురాలు సమీరా తెలిపిన వివరాల ప్రకారం ఉదయం వంట చేసుకునే సమయంలో గ్యాస్ లీకేజ్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని భయంతో బయటికి పరుగులు తీశానని గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ను బయటికి తీసుకువచ్చారని కానీ మంటలన ఆర్పేందుకు ప్రయత్నించిన మంటలు ఆదుపులోకి రాలేదని అన్నారు. ఇంట్లో ఉన్న ఐదు తులాల బంగారు 50 వేల నగదు నిత్యవసర సరుకులు బియ్యం వంట సామాగ్రి బట్టలు టీవీ బీరువా పూర్తి దగ్ధమయ్యాయి అని చెప్పారు. కూలి పని చేస్తూ రోజు జీవనం సాగిస్తున్నామన్నారు. ప్రభుత్వం తమ ఆదుకోవాలని వేడుకున్నారు. విషయం తెలుసుకున్న బండి ఆత్మకూరు ఎమ్మార్వో ధోని ఆల్ఫ్రెడ్ జిసి పాలెం గ్రామానికి చేరుకొని ప్రమాదవశాత్తు పూర్తిగా కాలిపోయిన పూరిగుడిసెను పరిశీలించారు. ఐదు లక్షలు ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేసి ఉన్నత అధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో ఈశ్వర్ గ్రామస్తులు పాల్గొన్నారు.