
అమ్మవారికి పవిత్ర సారె సమర్పించిన ఆలయ ఇంజినీరింగ్ విభాగం
విజయవాడ : ఆషాడ మాసం సందర్బంగా దేవస్థానంలో ఆలయ ఇంజినీరింగ్ విభాగం వారు ప్రతి సంవత్సరం వలె శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆలయ ఇంజినీరింగ్ విభాగం వారి ఆహ్వానం మేరకు డిప్యూటీ కలెక్టర్ మరియు ఆలయ కార్యనిర్వాహణాధికారి కె.ఎస్ రామరావు విచ్చేయగా ఇంజినీరింగ్ విభాగం అధికారులు వీరికి స్వాగతం పలికి దుశ్శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం జమ్మిదొడ్డి లోని దేవతా మూర్తుల వద్ద ఆలయ వైదిక సిబ్బందిచే పూజలు నిర్వహించి కార్యనిర్వాహనాధికారి వారు, ఉప కార్యనిర్వాహనాధికారి వారు మరియు ఇంజినీరింగ్ అధికారులు మరియు ఏఈఓ లు కొబ్బరికాయలు కొట్టి సారె కార్యక్రమంను ప్రారంభించారు. అనంతరం వీరు కుటుంబసభ్యులతో కలిసి ఊరేగింపుగా కనకదుర్గా నగర్ మీదుగా ఆలయమునకు చేరుకొనగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు.అనంతరం మహామండపం ఆరోవ అంతస్తు నందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి, అందరికీ ఆశీర్వాదం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమములో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, ఉప కార్యనిర్వాహణాధికారి లీలాకుమార్, కార్యనిర్వాహక ఇంజినీర్ లింగం రమాదేవి, డి ఈ లు కోటేశ్వర, రవీంద్రనాధ్ ఠాగూర్, ఏఈఈలు బొప్పన అశోక్ కుమార్, సి.హెచ్ సునీల్, మస్తానయ్య, మాదాల విజయ కృష్ణ లు, ఏఈఓలు పి చంద్ర శేఖర్, పి.సుధారాణి, ఎన్ రమేష్, జంగం శ్రీనివాస్, వైదిక సిబ్బంది, కాంట్రాక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.