ముందస్తు పరీక్ష – క్యాన్సర్ నుండి రక్ష

ముందస్తు పరీక్ష – క్యాన్సర్ నుండి రక్ష

మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: మండల కేంద్రమైన మద్దికేర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ రాగిణి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో మద్దికేర మండలంలోని పలు వీధుల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది టీం లాగా ఏర్పడి శనివారం రోజున ప్రజల ఇంటి వద్దనే క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు మాట్లాడుతూ ముందస్తు పరీక్ష ద్వారానే క్యాన్సర్ నుండి రక్షణ పొందవచ్చని,18 సంవత్సరములు దాటిన ప్రతి ఒక్క పౌరులు వారి ఇంటి వద్దకే వచ్చే హెల్త్ టీంకు సహకరించి సందేహించకుండా, నిర్లక్ష్యం చేయకుండా,ఆలస్యం చేయకుండా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని,క్యాన్సర్ పై విజయం స్క్రీనింగ్ తో సాధ్యమని డాక్టర్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నిరంజన్ బాబు,హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా,హెల్త్ సూపర్వైజర్ కృష్ణమ్మ,హెల్త్ సెక్రటరీ అంజలి,లక్ష్మీ మరియు ఆశా కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!