భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవం

శ్రీ శ్రీ పెట్టే బసవేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు.
భక్తులతో కిక్కిరిసిన ఆలయం.
కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న అశేష భక్త జనం.
హొళగుంద,  న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో సోమవారం కార్తీకమాసాన్ని పురస్కరించుకుని శ్రీ పెట్టే బసవేశ్వర స్వామి దేవాలయంలో సాయంత్రం మహిళలు,యువకులు ఘనంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ పెట్టే బసవేశ్వర స్వామి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత్ యూత్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శివ శంకర్ గౌడ,సిద్దార్థ్ గౌడ,హరీష్ గౌడ,గోపాల్ రెడ్డి హాజరయ్యారు.ప్రధానంగా ఈశ్వర,శ్రీ,ఓం,స్వస్తిక్ తదితర అకృతులలో ఏర్పాటు చేసిన దీపాలను వెలిగించడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.అలాగే ఆలయానికి వచ్చిన భక్తులకు శ్రీ పెట్టే బసవేశ్వర స్వామి మిత్రమండలి సభ్యులు ప్రసాదం అందజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ పెట్టే బసవేశ్వర స్వామి మిత్ర మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!