
నాడు నేడు పనులలో అధికారుల నిర్లక్ష్యం
ఉన్న గోడలకు కనబడకుండా మళ్ళీ ప్లాస్టింగ్.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పైపైన మెరుగులు.
అయితే ఏంటి ?అని వ్యంగ్యంగా సమాధానం చెప్పిన డిఈఈ
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: నాడు-నేడు కార్యక్రమంతో కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రభుత్వ కళాశాలల్లో రూపురేఖలను మార్చేశామన్నారు. కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే బడులలో బాగున్న గోడలకు మళ్ళీ ఫ్లాస్టింగ్ చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ దండుకున్నారు. నాణ్యతను మరచి విధులను దోచుకున్నారు. ఇందులో గత ప్రభుత్వ నాయకులు తప్పిదం ఉందనుకుంటే పొరపాటు ప్రభుత్వ అధికారులే కాంట్రాక్టర్లుగా మారి ఇస్తానుసారంగా ఉన్న గోడలకు మళ్ళీ పనులు చేసి ప్రజా ధనాన్ని నవ్వుల పాలు చేశారు. ఉన్న గోడలపై వేసిన ప్లాస్టింగ్ నిలబడక చివరికి ఊడి పోయింది.అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ కళాశాల విద్యార్థులు నానా అవస్థలు పడుతున్న సంఘటనలు బండిఆత్మకూరులో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళ్తే బండి ఆత్మకూరు ప్రభుత్వ కళాశాలలో నాడు నేడు పనుల కింద 30 లక్షల రూపాయలు నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుత కళాశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో 17 లక్షల రూపాయల మేర నాడు నేడు పనులు జరిగాయి.వర్షాకాలంలో
కళాశాల తరగతి గదిలో నీళ్లు కారుతున్నాయని స్లాబ్ తో పాటు గదులలో మరమ్మతులు చేపట్టారు. అప్పటి సర్వ శిక్ష అభియాన్ ఏఈ పనులను పూర్తిచేయడానికి తానే కాంట్రాక్టరు అవతారం ఎత్తి పనులు పూర్తిగా నిర్వహించినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. కళాశాల తరగతి గదిలో బాగున్న గోడకే పైపైన సిమెంట్ పూత పూసి నాడు నేడు నిధులను దుర్వినియోగపాలు చేసినట్లు ప్రజల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాగున్న గోడకే ప్లాస్టింగ్ చేయడంతో అది నిలబడక చివరికి అలా ఫోటోలో ఉన్నట్లు ఊడిపోయి కింద పడింది.కళాశాల ప్రిన్సిపాల్ వివరణ కోరగా చేసిన పనికి అప్పటి సర్వశిక్ష అభియాన్ ఏ ఈ అడిగిన విధంగా బిల్లులు చెల్లించినట్లు చెప్పడం విశేషం. ప్రభుత్వ కళాశాలలో నాడు నేడు పనుల నిర్లక్ష్యంపై సంబంధిత సర్వ శిక్ష అభియాన్ డిఈ కి వివరణ కోరగా అయితే ఏంటి? అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం విశేషం .నాడు నేడు పనుల నిధుల దుర్వినియోగంలో తలా చేయి వేశారని కళాశాల చుట్టుపక్కల అన్న ప్రజలు విమర్శలు సంధిస్తున్నారు. ప్రభుత్వ ధనం ఇంతలా దుర్వినియోగం చేస్తున్న సంబంధిత అధికారులపై జిల్లా ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రజలు చర్చించుకోవడం విశేషం.