నూతన విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయాలి

నూతన విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయాలి

  హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రంలోని బీసీ కాలనీ,7వ వార్డు నందు ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్థంభాన్ని మార్చి నూతన విద్యుత్ స్థంభం ఏర్పాటు చేయాలని మంగళవారం వార్డు సభ్యులు శశి శేఖర్,కాలనీ వాసులు విద్యుత్ ఏఈ ఓబులమ్మకు వినంతీ పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభం రహదారిలో రాకపోకలకు కూడా చాలా ఇబ్బందిగా ఉందని.ఆ స్తంభాన్ని తొలగించి మరోచోట ఏర్పాటు చేసి నూతన విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.కావున కాలనీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాలని వాసులు రారావి సిద్దు ,కోనేరు సిద్ధప్ప,కొరివి గోవిందు,కొండ బాబన్న,పకీరప్ప తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!