
పౌర సరఫరాల గొడం పాయింట్ ను తనిఖీ చేసిన ఆదోని సబ్ కలెక్టర్
ఆదోని, న్యూస్ వెలుగు; ఆదోని పౌర సరఫరాల గొదం పాయింటను బుధవారం ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్… గొదంలో ఉన్న రేషన్ నిల్వ, రికార్డ్స్, భద్రత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ బియ్యం కార్డ్ లబ్ధిదారులకు పంపిణీ చేసే పక్రియలో ఏటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని రెవెన్యూ అధికారులకు సబ్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు శవ రాముడు పౌర సరఫరాల శాఖ ఉప తహశీల్దారు వలి భాష రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM