
రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి
నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారులు మురళీకృష్ణ
బండిఆత్మకూరు, న్యూస్ వెలుగు: పంటల సాగులో రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ అన్నారు. గురువారం మండలంలోని బండి ఆత్మకూరు గ్రామంలో వరి పంట పొలాలను పరిశీలించారు అనంతరం రైతులతో మాట్లాడుతూ పంటల సాగులో అధికంగా రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి నికర ఆదాయం పెంచుకోవాలని అన్నారు. పంటలకు అధికంగా పురుగుల మందుల వాడకం తగ్గించాలని తద్వారా పెట్టుబడి తగ్గుతుందని తెలిపారు. వర్ష సూచనలు బట్టి వరి కోతులు జరుపుకోవాలని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో స్వాతి అన్ని గ్రామాల అగ్రికల్చర్ అసిస్టెంట్లు టిడిపి నాయకుడు మురళీధర్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 JOURNALIST B SAIKUMAR NAIDU
 JOURNALIST B SAIKUMAR NAIDU