
నీతి ఆయోగ్ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి
అమరావతి న్యూస్ వెలుగు : నీతి ఆయోగ్ తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంటు పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు -బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్… అనే ప్రధాన సూత్రాలు ఈ డాక్యుమెంట్ లో ఉంటాయని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. ఆశించిన లక్ష్యాలను సాధించే దిశలో విజన్ డాక్యుమెంట్ ఉండాలని సీఎం ఈ సమావేశంలో సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!