ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం సద్వినియోగం చేసుకోండి
హోళగుంద, న్యూస్ వెలుగు: నిరుపేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం హౌసింగ్ ఏఈ గోపీనాథ్ వర్మ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు శాశ్వత గృహ నిర్మాణం కోసం రూ.2 లక్ష 50 వెలతో నిర్మిస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని స్థలం ఉండి గృహం లేని ప్రతి ఒక్క నిరుపేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.మరియు లబ్ధిదారులు తమ తమ వార్డు పరిధిలో వచ్చే సచివాలయంలోని ఇంజినీయరింగ్ అసిస్టెంట్ వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda