
హెచ్ ఐవి విషయంలో భయంతో కాదు బాధ్యత మెలగాలి
న్యూస్ వెలుగు, కర్నూలు; HIV విషయంలో భయంతో కాదు బాధ్యతగా మెలగాలి” ఎయిడ్స్ వ్యాధి విషయంలో ప్రజలు భయంతో కాదని వ్యాధిపై అవగాహన పెంచుకొని బాధ్యతగా మెలగాలని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & కర్నూల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె . చిట్టి నరసమ్మ అన్నారు. శనివారం కాలేజీలోని ఓల్డ్ సి.యల్.జి యందు ఆసుపత్రి సుపరిండెంట్ ఆద్వర్యంలో ఏ.ఆర్.టి ప్లస్ సెంటర్ ఆధ్వర్యంలో నోడల్ ఆఫీసర్ డామామ్ శ్రీనివాసులు అధ్యక్షతన డిసెంబర్ 1న ఎయిడ్స్ డే పురస్కరించుకొని కు పీజీ లకు, సిబ్బందికి HIV/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ హెచ్ఐవి/ఎయిడ్స్ పై నిరంతరం పరిశోధనల ఫలితంగా మెరుగైన ఫలితాలనిస్తున మందులు అందుబాటులోకి వచ్చాయని అందువల వ్యాధి పట్ల నిరంతర అవగాహన ముఖ్యం అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తన ఆరోగ్యం తన హక్కు గా భావించాలని అందుకు సరియైన మార్గాన్ని ఎన్నుకోవాలని పిలుపు నిచ్చారు. ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ HIV ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి చికిత్స అందించినట్లయితే వారి జీవితకాలం మరింత పొడిగించబడుతుందని తెలిపారు. ఎయిడ్స్ విషయం లో పిల్లల, గర్భిణీలు పెద్దల విషయాల్లో అధునాతన మందులు అందుబాటు లోకి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ ఏకలెన్సీ నుండి డా. ప్రభు,& డాక్టర్ కుసుమాబాయి ,డాక్టర్ మల్లికార్జున, డాక్టర్. కుముదలు సబ్జెక్టు పై అవగాహన కలిగించారు. షేర్t ఇండియా పి.ఓ సుకుమార్ , కౌన్సిలర్ వినోద్ ఏ.ఆర్.టి సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.