మూల బృందావన వెండి ప్రతిమకు బంగారు పల్లకి సేవ

మూల బృందావన వెండి ప్రతిమకు బంగారు పల్లకి సేవ

మంత్రాలయం: మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్ర స్వామి మఠంలో మూల బృందావన వెండి ప్రతిమకు అర్చకులు బంగారు పల్లకి సేవ నిర్వహించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బృందావన సేవ చేసిన అనంతరం భక్తులతో వెండి బృందావన ప్రతిమను బంగారు పల్లకిలో ఉంచి శ్రీమఠం ప్రాకారంలో వైభవంగా ఊరేగించారు.అర్చకులు భక్తులకు ఫలమంత్ర అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మఠం సహాయ పీఆర్‌ఓ వ్యాసరాచార్‌, శ్రీనాథ ఆచార్‌, శ్రీకాంతాచార్‌ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!