ప్రభుత్వ అనుమతి లేని డయాగ్నొస్టిక్ సెంటర్ లను సీజ్ చేయాలి 

ప్రభుత్వ అనుమతి లేని డయాగ్నొస్టిక్ సెంటర్ లను సీజ్ చేయాలి 

న్యూస్ వెలుగు, కర్నూలు; కొంతమంది ప్రవేట్ వ్యక్తులు విచ్చలవిడిగా డయాగ్నొస్టిక్ సెంటర్ ఏర్పాటు చేసుకొని వైద్య పరీక్షలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అలాంటి వాటిని కట్టడి చేయలేని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అనుమతి లేని డయాగ్నొస్టిక్ వెంటనే సీట్ చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినతిపత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు జిల్లా కార్యవర్గ సభ్యులు చంటి, నాగేశ్వరరావు, నగర ఆర్గనైజింగ్ కార్యదర్శి కృష్ణ నగరనాయకులు శివాజీ* పాల్గొన్నారు . మున్సిపాలిటీ అనుమతి, మెడికల్ వేస్టేజ్ అనుమతి, ఫైర్ సర్టిఫికెట్ తో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి తప్పనిసరిగా అనుమతి తీసుకోవడమే కాకుండా అర్హత కలిగిన టెక్నీషియన్ వైద్యుల పర్యవేక్షణలో డయాగ్నొస్టిక్ సెంటర్ నిర్వహించాలని నిబంధనలో ఉన్నప్పటికీ కలెక్టర్ కార్యాలయం చుట్టూ అనేక డయాగ్నొస్టిక్ సెంటర్లు ఎలాంటి అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయని వీటి పైన గతంలో అనేకసార్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇదే అదునుగా రోజు ఒక ప్రవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్ పుట్టగొడుగుల పుట్టుక వస్తున్నాయి , ఇలాంటి వాటిని వెంటనే సీజ్ చేసి ప్రజల ప్రాణాలు కాపాడడమే కాకుండా వాటికి సహకరిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

Author

Was this helpful?

Thanks for your feedback!