స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పించాలి ; ఏఐవైఎఫ్

స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పించాలి ; ఏఐవైఎఫ్

న్యూస్ వెలుగు, కర్నూలు; అధికారుల నిర్లక్ష్యం పాలకుల వైఫల్యం క్యాన్సర్ రోగుల పట్ల శాపంగా మారిందని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు నగర కార్యదర్శి బిసన్న విమర్శించారు. బుధవారం నాడు అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో క్యాన్సర్ పేషెంట్లకు వైద్య సేవలందించే విధంగా చర్యలు తీసుకోవాలని స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు . కార్యక్రమానికి ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు బాబయ్య అధ్యక్షత వహించాడు , ప్రభుత్వ అధికారులు మారుతా ఉన్న క్యాన్సర్ హాస్పటల్లో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం జరుగుతుందని 2019 జనవరి నెలలో శంకుస్థాపన చేస్తే 2024 సంవత్సరం పూర్తి కావస్తున్న ఇప్పటివరకు పూర్తిస్థాయిలో వైద్య సౌకర్యాలు లేకపోవడంతో కేవలం ఊపి చూసి పంపిస్తున్నారని ఇది వైద్యాధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు 2024 మార్చి 7 వ తేదీన అప్పటి వైసీపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి చేతుల మీదుగా స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించినప్పటికీ 9 నెలలు గడుస్తా ఉన్న పూర్తిస్థాయి సౌకర్యాలు లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. కోట్ల రూపాయలు విలువైన వైద్య పరికరాలు వచ్చినప్పటికీ వాటిని ఉపయోగించకపోవడం వల్ల క్యాన్సర్ పేషంట్లకి శాపంగా మారిందని అర్ధ ఆయుష్ తో క్యాన్సర్ పేషెంట్లు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని మరి కొంతమంది లక్షలు వెచ్చించి వేరే రాష్ట్రాలకు వైద్యం కోసం వెళ్తున్న పరిస్థితి దాపరించిందన్నారు. కాన్సర్ హాస్పటల్లో విద్యుత్ అవసరాల కోసం జనరేటర్ ఏర్పాటు చేయడం ఆక్సిజన్ పైప్ లైన్లు ఎమర్జెన్సీ వార్డులో వెటిలేటర్ సౌకర్యాలు, శానిటేషన్ సిబ్బంది, వార్డ్ బాయ్స్, సెక్యూరిటీ గార్డ్లను నియమించకపోవడం వల్ల క్యాన్సర్ రోగుల పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించలేకపోతున్నారని అయితే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పాత బిల్లులు పెట్టుకొని కొంతమంది అధికారులు దాదాపు 50 లక్షల నుంచి 60 లక్షల వరకు క్యాన్సర్ హాస్పిటల్ నిధులను స్వాహా చేశారని ఆరోపణలు వస్తా ఉన్నాయని కావున వీటన్నిటి పైన జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే మంత్రి టీజీ భరత్ స్పందించి అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా క్యాన్సర్ హాస్పటల్లో మౌలిక వసతులు కల్పించి క్యాన్సర్ పేషంట్లకి మెరుగైన వైద్య సౌకర్యాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో క్యాన్సర్ హాస్పిటలో పూర్తిస్థాయిలో వైద్య సౌకర్యాల కల్పించేంతవరకు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని సమస్య పరిష్కారం కోసం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!