
త్రాగునీటి పైప్ లైన్ ఏర్పాటు
హోలగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలోని ఎల్లార్తి గ్రామంలో బుధవారం సర్పంచ్ కురువ చాముండేశ్వరి ఆధ్వర్యంలో దర్గా కాలనీ ప్రజలకు త్రాగునీటీ పైపులైన్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దర్గా కాలనీ ప్రజలకు త్రాగునీటీ ఎద్దడి తీవ్రంగా ఉండడంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొత్త పైపు లైన్ వేయించడం జరిగిందన్నారు.అలాగే గ్రామంలో ప్రజలు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా గ్రామాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో యువనేత ఎస్కే గిరి తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!