ఆ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తాం : కేంద్ర మంత్రి

Delhi (ఢిల్లీ) : రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని బుధవారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో సప్లిమెంటరీలకు సమాధానమిస్తూ, ప్రాజెక్టులో భాగంగా సముద్రం కింద 30 మీటర్ల మేర దేశంలోనే తొలిసారిగా 21 కిలోమీటర్ల పొడవైన సొరంగాన్ని నిర్మిస్తున్నామన్నారు. 320 కిలోమీటర్ల మేర ప్రాజెక్టు శంకుస్థాపన పూర్తయిందని, ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్ కింద అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ సాంకేతికతతో కూడిన ప్రాజెక్ట్ అని ఆయన అన్నారు. త్వరలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని సమాధానం ఇచ్చారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM