ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి 

ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి 

   కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు:  తమ పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని గురువారం రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. బండి ఆత్మకురు మండలంలోని సంత జూటూరు నంద్యాల ఆత్మకూరు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నారాయణపురం, పెద్దదేవలాపురం ,జిసి పాలెం,లింగాపురం గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.మండల వ్యవసాయ కార్మిక సంఘంజరిగిన ఈ నిరసన కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వెంకటకృష్ణారెడ్డి , జిల్లా కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ రైతు పండించిన వరి పంటకు మద్దతు ధర కనీసం 3000 ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇప్పటికే దిగుబడి సరిగా రాకపోగా, మళ్లీ ఇప్పుడు అకాల వర్షాలతో రైతులు నష్టాలలో కూరుకుపోతున్నారన్నారు. దేశానికి అందం పెట్టే రైతు బాధలలో కొట్టేమిట్టాడుతుంటే ప్రభుత్వం కనీసం మద్దతు ధర ఏమోగానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం పట్ల తీవ్ర అసహన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవడంతో బండి ఆత్మకూరు ఎస్సై జగన్మోహన్ రైతు సంఘం నాయకులతో మాట్లాడిన రైతులు వినకపోవడంతో ఆత్మకురు ఆర్డీవో ద్వారా జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తో చరవాణి లో మాట్లాడారు. రెండు రోజులలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రత్నమయ్య డేవిడ్ రాజు పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!