
డిసెంబర్ 6ను ఫాసిస్ట్ వ్యతిరేక దినంగా నిర్వహించిన ఎస్దిపిఐ
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో శుక్రవారం ఎస్దిపిఐ ఆలూరు అసెంబ్లీ కరవర్గ తరుపున పత్రిక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎస్దిపిఐ ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ 1992 డిసెంబర్ 6న, హిందుత్వ భావజాలానికి అనుకూలమైన ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ నేతృత్వంలో పనిచేసే కరసేవకులు,కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ బాబ్రీ మసీద్ను కూల్చివేశారు.ఈ ఘటన మత సామరస్యాన్ని తీవ్రంగా దెబ్బతీసి,భారత చరిత్రలో చీకటి దినంగా నిలిచిందన్నారు.ఆర్ఎస్ఎస్,విశ్వ హిందూ పరిషత్, మరియు అనుబంధ సంస్థలు హిందూ-ముస్లిం సామాజిక విభజనకు దారితీసే విధంగా ఉద్యమాన్ని ప్రేరేపించాయన్నారు.ఈ ఘటన తరువాత దేశవ్యాప్తంగా మత ఘర్షణలు చోటుచేసుకుని వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని కావున డిసెంబర్ 6ను ఫాసిస్ట్ వ్యతిరేక దినంగా నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మరియు 1991 వర్షిప్ యాక్ట్ ను పరిరక్షించాలని సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరుపున డిమాండ్ చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఆలూరు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సుబాన్,ఉపాధ్యక్షులు అబ్దుల్ రెహమాన్,కార్యదర్శి సలాం,హఫీజ్,బక్షి,భాష,షఫీ,అస్లం,రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు.