నిలిచిపోయిన రోడ్ల విస్తరణ పనులు చేయాలి;  ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి

 నిలిచిపోయిన రోడ్ల విస్తరణ పనులు చేయాలి;  ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి

న్యూస్ వెలుగు, కర్నూలు; కర్నూలు ప‌ట్ట‌ణంలో నంద్యాల చెక్ పోస్ట్ నుండి గార్గేయ పురం మార్గంలో నిలిచిపోయిన రోడ్ల విస్త‌ర‌ణ ప‌నుల‌ను, ఆర్అండ్ బి మినిస్టర్ శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి క‌లిసి ఎమ్మెల్యే గౌరు చ‌రిత రెడ్డి ప‌రిశీలించ‌డం జ‌రిగింది. సంద‌ర్భంగా రోడ్ల విస్త‌ర‌ణ ప‌నులు ఆగిపోవ‌డంతో త‌ర‌చుగా రోడ్డు ప్రమాదాలు జ‌ర‌గుతున్నాయ‌ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అనంత‌రం కర్నూలు జిల్లా కలక్టరేట్ మిని కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశంలో మంత్రి బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి  నంద్యాల చెక్ పోస్ట్ నుండి గార్గేయపురం వరకు రోడ్డు వైoడింగ్ పెండింగ్ పనులపై ప్రభుత్వానికి నివేదిక పంపి, త్వరితగతిన పూర్తి చేయాల‌ని కర్నూలు జిల్లా కలెక్టర్ పీ రంజిత్ భాష జాయింట్ కలెక్టర్ డా బి నవ్య మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు ,ఆర్డీవో సందీప్ , ఇత‌ర ఆర్ & బి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాజీ మార్కేట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి , తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణ పల్లె నాగిరెడ్డి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!