
తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం లో సూపరింటెండెంట్
న్యూస్ వెలుగు, కర్నూలు; సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అశ్వత్థపురం గ్రామం కల్లూరు మండలం లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నట్లు తెలిపారు. స్కూల్ కమిటీ పేరెంట్స్ తో ప్రతిజ్ఞ అనంతరం స్కూల్ విద్యార్థులతో కలిసి వారితో భోజనం చేసినట్లు తెలిపారు.తల్లిదండ్రులు పిల్లలతో తన జీవితం లో జరిగిన విద్యాభివృద్ధి గురించి విద్యార్థి ప్రాముఖ్యత గురించి ప్రోత్సాహమకరమైన ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం మధ్యాహ్న భోజనం పిల్లలతో పాటు రుచికరమైన భోజనం అందించారు.విద్య పై తల్లిదండ్రుల పాత్ర అవసరమని వివరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, చంద్రశేఖర్ స్కూలు హెచ్ఎం, శ్రీమతి.కీర్తి, గ్రామ పెద్దలు, ఈదుర్ భాషా, అన్వర్ భాషా ,మౌలాలి ,తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar