విద్యార్థులు విద్యతోపాటు, క్రీడలపై ఆసక్తి చూపాలి

విద్యార్థులు విద్యతోపాటు, క్రీడలపై ఆసక్తి చూపాలి

  టిడిపి నాయకుడు లాయర్ కృష్ణారెడ్డి

బండి ఆత్మకూరు,  న్యూస్ వెలుగు: విద్యార్థులు విద్యతోపాటు క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని టిడిపి నాయకుడు లాయర్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మండలం లోని సంతజూటూరు జిల్లా పరిషత్ పాఠశాల నందు శనివారం పేరెంట్స్ టీచర్స్ సమావేశంను పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా టిడిపి నాయకుల లాయర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు క్రీడలపై ఆసక్తి చూపాలని అందుకు తల్లిదండ్రులు ప్రోత్సాహం కావాలన్నారు. చత్రపతి శివాజీ మహాత్మా గాంధీ లాంటి ఎంతోమంది తమ తల్లిదండ్రుల నుంచి ప్రేరణ పొందారని గుర్తు చేశారు.అనకాపల్లిలో నిర్వహించిన హాకీ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో సంత జూటూరు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని రాజేశ్వరి ఆట ఆడి ప్రశంస పత్రాన్ని తీసుకురావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రశంస పత్రాన్ని విద్యార్థికి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానోపాధ్యాయురాలు షఫీమున్నీసా,విజయభారతి మాట్లాడుతూ.తల్లిదండ్రుల జీవనశైలి పిల్లలపై ఎంతో ప్రభావం చూపుతుందని నేటి ఆధునిక సమాజంలో డబ్బు సంపాదన కోసం అధిక సమయం కేటాయిస్తూ తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించడం లేదని అన్నారు.ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందని దాన్ని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. తల్లిదండ్రులే పిల్లలకు మొదటి గురువు తెలిపారు.
అనంతరం గేమ్స్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్లు వింజమూరి జయభాను కొర్రపోలు జీవన్ కుమార్ వెటర్నరీ డాక్టర్ అనూష టిడిపి నాయకులు మహేశ్వర్ రెడ్డి అలిశం జగదీశ్వర్ గౌడ్ చెన్నయ్య ప్రభాకర్ రెడ్డి చలమయ్య,ఉపాధ్యాయులు నాగశేషులు శ్యామల నాగన్న శ్రీనివాసులు, శ్రీనివాసులు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!