బిజెపి బూత్ కమిటీ ఎన్నిక నిర్వహణ

బిజెపి బూత్ కమిటీ ఎన్నిక నిర్వహణ

న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; బిజెపి గత బూత్ కమిటీ ఎన్నిక ఒంటిమిట్ట మండలం చెర్లోపల్లె గ్రామ బూత్ కమిటీ వార్డ్ నెంబర్ 58 బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ బూత్ కమిటీ వార్డు అధ్యక్షుడిగా ఎస్వీ ప్రతాపరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమము మండల బిజెపి అధ్యక్షుడు బాలరాజు. శివరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుకుంట రమేష్ నాయుడు వచ్చి మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశలో క్రియాశీలక సభ్యత్వం నిర్వహించి అనంతరం ప్రతి పోలింగ్ బూతు అధ్యక్షున్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పాతిక లక్షల సభ్యత్వం పూర్తి చేసుకుందని ఈనెల చివరికల్లా మండల కమిటీలు జనవరి కల్లా జిల్లాస్థాయి రాష్ట్రస్థాయి నూతన కమిటీలు ఎన్నుకోబతాయన్నారు. అందులో భాగంగానే అన్ని బూత్ కమిటీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలియజేశాడు. రాష్ట్రంలో బిజెపి పార్టీని బలోపేతం చేయాలని కార్యవర్గ సభ్యులకు తెలియజేశాడు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వేరే పార్టీలో ఇటువంటి విధానం ఉండదని ఒక భారతీయ జనతా పార్టీలోనే ఈ విధానం అమలులో ఉంటుందని మండల స్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి బూత్ కమిటీ అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి మాజీ అధ్యక్షుడు పాటూరు .గంగిరెడ్డి, పాపయ్య, గురూజీ వర్మ, నరసింహులు, పెద్ద అప్పయ్య ,లక్ష్మిరెడ్డి, వెంకటరామరాజు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!