
ప్రారంభమైన ధనుర్మాస పూజలు
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల కేంద్రంలో సోమవారం మండల ప్రజల ఆరాధ్యదైవం శ్రీ సిద్దేశ్వర స్వామి సన్నిధిలో ఆలయ ధర్మకర్త రాజా పంపన్న గౌడ ఆధ్వర్యంలో ధనుర్మాస పూజలు ప్రారంభమైయ్యాయి. ఉదయం నుంచి స్వామి వారి సన్నిధిలో వేదపండితుల మంత్రోచరల మధ్య శివశంకర్ గౌడ,సిద్దార్థ్ గౌడ స్వామి వారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం,కుంకుమార్చన, బిల్వార్చన,ఆకుపూజ వంటి విశేష పూజలు నిర్వహించి,స్వామివారిని పెద్ద ఎత్తున పూలమాలలతో అలంకరించారు.అలాగే ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Was this helpful?
Thanks for your feedback!

