ఇంటింటికి మోడీ ఫిట్ నెస్ మంత్ర , అందరికీ ఆరోగ్య యోగం

ఇంటింటికి మోడీ ఫిట్ నెస్ మంత్ర , అందరికీ ఆరోగ్య యోగం

విజయవాడ, న్యూస్ వెలుగు: అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతంగా నిర్వహించడానికి అందరి సహకారం కావాలని మరియు యోగా అభివృద్ధికి ప్రధాని మోడీ విశిష్ట కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు అంతర్జాతీయ యోగా దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. 21వ తేదీ వరకు జరగనున్న అంతర్జాతీయ యోగాను విజయవంతం చేయాలని, యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రధానమంత్రి మోడీ విశాఖపట్నం పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆస్పా భారత్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం లో భాగంగా మోడీ ఫిట్నెస్ మంత్ర పై అవగాహన కార్యక్రమాలకు ప్రభుత్వ అధికారుల, సేవా సంస్థల మద్దతు లభిస్తుందని ఆక్యు ప్రెషర్, యోగాలతో అందరికీ ఆరోగ్య యోగం కలగాలని కోరారు.రుగ్మతలు తగ్గించడం ఇకముందు రోగాల బారిన పడకుండా సర్జరీలను తప్పించుకునేలాగా జీవన విధానంలో మార్పులు చేసుకుంటూ మానవులలో ఉన్న ప్రాణ శక్తి కేంద్రాలను, ప్రాణశక్తి కేంద్రాలను చైతన్యపరచుకోవడం ద్వారా సాధించుకునే ఆరోగ్యం ఖర్చు లేదని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనిదని, ఇందులో ఆక్యుప్రెజర్ రోలర్ వాడకం ఫుడ్ రిఫ్లెక్షన్ చేసుకోవడానికి ఫుడ్ వాక్ బెనిఫిట్స్ తెలియజేయడం, ప్రాణమయాలలో మొత్తం విధానాన్ని తెలియజెప్పి ప్రాక్టీస్ చేయడం మెడిటేషన్ మరియు ఆసనాల పట్ల అవగాహన పెంచడం మరియు అంతర పంచభూతాలను సమస్థితికి తెచ్చేలాగా పనిచేసే విధానాలను తెలిపి వాళ్ళంతట వాళ్ళు చేసుకునేలాగా నేర్పడతాయని ముంజంపల్లి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్, డాక్టర్ మాకాల సత్యనారాయణ, యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్, డాక్టర్ ముంజంపల్లి శివకుమార్, ఆస్పా భారత్ జాతీయ వైస్ ప్రెసిడెంట్, వంకదారి సుబ్బరత్నమ్మ , సెక్రెటరీ ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ, లైబ్రేరియన్స్ కొండ చిన్నపరెడ్డి, నంద్యాల నాగిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!