
ఉచితమేగా డీఎస్సీ
కర్నూలు న్యూస్ వెలుగు : కర్నూలు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థుల కోసం ఉచిత మెగావి డి.యస్.సి. క్రాష్ కోర్సు శిక్షణను విజయవాడలో నిర్వహించనున్నారు. ముఖ్యంగా అంధులు, బధిరులు మరియు శారీరక మొదలగు విభిన్న ప్రతిభావంతులైన యస్.జి.టి.టీచర్ పోస్టులకు అర్హత గల ఆభ్యర్థుల కోసం ఈ శిక్షణను ఏర్పాటు చేయబడింది.అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా mdfc.apcfss.in వెబ్సైట్ను సందర్శించి ఈ నెల 11వ తేదీ లోగా ధరఖాస్తు చేసుకోవచ్చును. కనీసం 40% వికలత్వం ఉన్న మాత్రమే అర్హులు. శిక్షణ కొరకు ఎంపిక టెట్ స్కోర్ ఆధారంగా జరుగును. ఎంపికైన అభ్యర్థులకు ప్రత్యేక బోధనా పద్ధతుల్లో శిక్షణ, స్టడీ మెటీరియల్, ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యాలు కల్పించబడతాయి. కర్నూలు జిల్లాలోన్ని విభిన్న ప్రతిభావంతులైన మెగా డి.యస్.సి. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ భవిష్యతును మెరుగుపరచుకోగలరని తెలియజేయటమైనది. రయిస్ ఫాతిమా
సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ, కర్నూలు.