
దేవరగట్టు హుండి లెక్కింపు
హోళగుంద, న్యూస్,వెలుగు: మండల పరిధిలో దేవరగట్టు శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామి కొండ పై ఉన్న హుండిని ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు,గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో బుధవారం ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో లెక్కించారు.ఇందులో రూ.2 లక్షల 60 వేలు వచ్చినట్లు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ హుండి మొత్తాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పారు.అనంతరం నేరణికి,నేరణికి తండా సర్పంచ్లు టీడీపి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆలూరు మార్కెట్ యార్డు చైర్మన్ గుమ్మనూరు నారాయణ,మూడు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist