
హజ్ యాత్ర పై అవగాహన కార్యక్రమం
కర్నూలు న్యూస్ వెలుగు: కూటమి ప్రభుత్వం హాజ్ యాత్రికులకు ఎంతో అండగా ఉందని రాష్ట్ర హాజ్ కమిటీ డైరెక్టర్ మన్సూర్ అన్నారు. హాజ్ యాత్ర కు వెళ్లే వారికోసం రాయలసీమ హాజ్ సొసైటీ ఆధ్వర్యంలో కర్నూలులో అవగాహన సదస్సు నిర్వహించారు. 45 రోజుల హాజ్ యాత్రలో ఎలా నడుచుకోవాలి అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయాలు ఈసదస్సులో వివరించారు. ఈసంవత్సరం 2 వేల 3 వందల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హాజ్ యాత్రకు వెళ్తున్నారని గత సంవత్సరం 16 వందల మంది వెళితే ఈసంవత్సరం ఎక్కువ సంఖ్యలో యాత్ర కు వెళ్లేందుకు అనుమతులు ఇచ్చారని తెలిపారు. హాజ్ యాత్ర కు వె భక్తులకు సబ్సిడీ లక్ష రూపాయలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

