స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి

స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి

న్యూస్ వెలుగు, కర్నూలు మండలం; ఉల్చాల గ్రామంలో స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు గురువారం కర్నూలు మండలం,ఉల్చాల గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సు ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా డివైఎఫ్ఐ జిల్లా నాయకులు అబ్దుల్లా,మండల నాయకులు అంజి,గ్రామపెద్దలు కల్లు శివన్న, అనుమంతు,ఇస్మాయిల్,వెంకటేశ్వర్లు, సురేష్ లతో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర మాట్లాడుతూ ఉల్చాల గ్రామంలోని హిందూ స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.దాదాపు 60 సంవత్సరాల కిందట గ్రామంలోని సర్వే నంబర్ 443లో అప్పుడు జనాభాకు అనుగుణంగా ఒక ఎకరా భూమి కేటాయించారని అన్నారు.అందులో కూడా 80సెంట్ల స్థలం బండ ఉన్న కారణంగా దానిని ఉపయోగించుకోకుండా ఉన్న స్థలాన్ని ఉపయోగిస్తూ వచ్చారని తెలియజేశారు.ఇప్పుడు గ్రామ జనాభా 10,000మంది ఉంటారని అందులో మైనార్టీలు,క్రైస్తవులు మినహాయిస్తే మిగతా వారు దాదాపు 6000మంది ఉంటారని, 6000మంది జనాభాకు 20సెట్ల స్థలం ఏ మాత్రం సరిపోదని తెలియజేశారు.ఒక్క 2024సంవత్సరంలోనే దాదాపు 40మంది ఆ గ్రామంలో మరణించారని అన్నారు.స్థలం సరిపోక పూడ్చిన శవాన్ని ఆరునెలలు గడవకముందే తీయాల్సిన పరిస్థితి ఉందని తెలియచేశారు.దానివల్ల గుంతలు తీసే వాళ్లు,గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు.గతంలో మిగిలిన 80సెంట్ల భూమిలో కూడా ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారని, అందువల్ల వెంటనే గ్రామ జనాభాకు అనుగుణంగా రెండు ఎకరాల స్థలం స్మశానం కోసం కేటాయించాలని,స్మశానం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మార్వో స్పందిస్తూ త్వరలో గ్రామంలో స్థలాన్ని గుర్తించి స్మశాన వాటిక కోసం ఇస్తామని హామీ ఇచ్చారు.

Author

Was this helpful?

Thanks for your feedback!