
కోసిగి సర్కిల్ కార్యాలయ వార్షీక తనిఖీ
నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
జి.బిందు మాధవ్,కర్నూలు జిల్లా ఎస్పీ
కోసిగి, న్యూస్ వెలుగు; కోసిగి సర్కిల్ కార్యాలయాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ శుక్రవారం వార్షీక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు,నిందితుల అరెస్టు,కేసుల దర్యాప్తులు,వాటి పురోగతిపై కేసుల ఫైళ్ళను క్షుణ్ణంగా పరిశీలించారు.ముఖ్యమైన కేసులు,పాత గ్రేవ్ కేసులను సమీక్షించారు. ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ చేయాలని, సమర్థవంతమైన నేర నియంత్రణ,నివారణ చర్యలు చేపట్టాలన్నారు.బాధితులు పోలీసుస్టేషన్ ను ఆశ్రయించినప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. కోసిగి సర్కిల్ కార్యాలయం పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తదనంతరం మొక్కను నాటారు.సైబర్ నేరాలపై, మహిళ చట్టాలపై,నూతన చట్టాల పై ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజలకు అవగాహన చేయాలన్నారు.జిల్లా ఎస్పీతో పాటు ఎమ్మిగనూరు డిఎస్పీ ఉపేంద్రబాబు,యస్బి సిఐ ప్రసాద్,డి.సి.ఆర్.బి సిఐ గుణశేఖర్ బాబు,కోసిగి సిఐ మంజునాథ్,కోసిగి ఎస్సై చంద్రమోహన్,పెద్దకడబూరు ఎస్సై నిరంజన్ రెడ్డి,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.