గ్రామాల అభివృద్ధికి ఎన్డీయే కూటమి కట్టుబడి ఉంది

గ్రామాల అభివృద్ధికి ఎన్డీయే కూటమి కట్టుబడి ఉంది

    ఎం.పి బస్తిపాటి నాగరాజు

న్యూస్ వెలుగు, కర్నూలు; గ్రామాల అభివృద్ధికి ఎన్డీయే ఆ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు.. కర్నూలు రూరల్ మండలంలో ని పంచలింగాల గ్రామంలో పర్యటించిన ఎం.పి.. రోడ్లు, మురికి కాలువలను పరిశీలించారు.. ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలను గ్రామస్తులు ఎం.పి దృష్టికి తీసుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీ నిధులను దారి మళ్ళించడం తో గ్రామాలు అభివృద్ధి నోచుకోలేదని ఆరోపించారు.. ఎన్డీయే కూటమి ప్రభుతం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి పరుస్తున్నామని ఎం.పి నాగరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కృష్ణ యాదవ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు..

Author

Was this helpful?

Thanks for your feedback!