FlatNews Buy Now
మహిళలను పోలిస్టేషన్ చుట్టూ తిప్పడం సరికాదు : పట్నం రాజేశ్వరి

మహిళలను పోలిస్టేషన్ చుట్టూ తిప్పడం సరికాదు : పట్నం రాజేశ్వరి

కర్నూలు న్యూస్ వెలుగు : మహిళలు సమస్యల పట్ల పోలీసులు నిర్లక్ష్యం వహిస్తూ నెలల తరబడి పోలీసు స్టేషన్ ల చుట్టూ తిప్పుకుంటున్నారని పట్నం రాజేశ్వరి అన్నారు. కర్నూలు నందలి స్థానిక బి క్యాంపులో గల ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక ప్రధాన కార్యాలయం లో మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిధిగా మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులను ఆమె తీవ్రంగా ఖండించారు.బాధిత మహిళలు స్టేషన్ ల చుట్టూ నెలల తరబడి తిరుగుతున్న పోలీసులు నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగిటి వర్షిత అను మహిళ తన భర్త వేధింపులపై బేతంచర్ల పోలీసులకు ఫిర్యాదు చేసి మూడు నెలలుగా స్టేషను చుట్టూ తిరుగుతున్న తన గోడును పట్టించు కోవడం లేదని వర్షిత తెలిపిందని ఆమె తెలిపారు. అలాగే రామళ్ళకోట గ్రామానికి చెందిన అంగం జయమ్మ ను కోడలు మానసికంగా వేధిస్తూ దౌర్జన్యంగా ఇంటి నుండి గెంటి వేస్తే ఆమె వెల్దుర్తి పోలీసులను ఆశ్రయించింది. దాదాపు నాలుగు నెలలుగా జయమ్మ తన కుటుంబ సమస్యను పరిష్కరించమని వెల్దుర్తి పోలీసు స్టేషను చుట్టూ తిరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు. డోన్, ఎమ్మిగనూరు, కర్నూలు ఇలా ప్రతి పోలీసు స్టేషనులో బాధిత మహిళలు నెలల తరబడి పోలీసు స్టేషనుల చుట్టూ తిరుగుతున్న న్యాయం అందడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక బాధిత మహిళలకు అండగా నిలబడుతూ పోరాటాలకు సిద్ధం కావాలని ఆమె పిలుపు నిచ్చారు.అనంతరం రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సావిత్రిబాయి పూలే మరియు ఫాతిమా షేక్ జయంతి వారోత్సవాల కార్యక్రమానికి సంబంధించిన సమీక్ష మరియు జమ ఖర్చుల గురించి మహిళా ఐక్య వేదిక సభ్యులకు వివరించడం జరిగింది. అలాగే గత సంవత్సరంలో చేసిన కార్యక్రమాలు మరియు మహిళా ఐక్య వేదిక నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి వివరించారు.నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు మండల గ్రామ కమిటీలను వేసి మహిళలను ఏకం చేస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఆమె తెలిపారు. కమిటీ సభ్యులు అందరూ కలిసికట్టుగా శ్రమించి మహిళా ఐక్య వేదిక ను మరింత బలోపేతం చేయాలని ఆమె ఉమ్మడి జిల్లాల కార్యవర్గ సభ్యులను కోరారు. కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లాలోని అన్ని మండలాల్లో మహిళా ఐక్య వేదిక కమిటీ నిర్మాణాలు చేపట్టాలని, ఆమె కమిటీ సభ్యులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా అధ్యక్షురాలు వగ్గా ఈరమ్మ, నంద్యాల జిల్లా అధ్యక్షురాలు కటికే భాను కర్నూలు జిల్లా ఉపాధ్యక్షురాలు హుస్సేన్ బీ, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షురాలు ఆకుతోట పద్మావతి, ఆదోని డివిజన్ అధ్యక్షురాలు ఎలీశమ్మ, మరియమ్మ , కొమ్ము పెద్దక్క, కమ్మరి లక్ష్మి , ఖాసీంబీ, రంగమ్మ, షేకూన్ బీ,మరియమ్మ , రేవతి దస్తగిరమ్మ , సింధూజ, అమీనా, చిరంజీవమ్మ , కళావతి, ఖాజాబీ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!