
రైతు సమస్యలు పరిష్కరించలేని గ్రామ రెవెన్యూ సదస్సులు ఎందుకు..?
రైతు సంఘం నాయకులు
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: రైతులు సమస్యలు పరిష్కరించలేని గ్రామ రెవెన్యూ సదస్సులు ఎందుకని మండల వ్యవసాయ రైతు సంఘం నాయకులు సుధాకర్ రెడ్డి రత్నమయ్య రాజు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ సమస్యలు గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కారం కావడం లేదని రెవెన్యూ సదస్సులో రైతులకు సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రైతుల్లో తీవ్ర నిరాశ ఎదురై రెవెన్యూ సదస్సులకు రైతులు రావడంలేదని వారన్నారు. రైతుల నుంచి అధికారులకు ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించాలని లేనియెడల రైతులతో కలసి కార్యాలయాలను ముట్టడి చేస్తామన్నారు. పార్నపల్లె నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ పద్మావతికి రైతుసంఘం నాయకులు
అందజేశారు.
Was this helpful?
Thanks for your feedback!