రైల్వే స్టేషన్ కూడలిని    కర్నూలు నగరపాలక సంస్థ సుందరవనంగా మార్చాలి

రైల్వే స్టేషన్ కూడలిని    కర్నూలు నగరపాలక సంస్థ సుందరవనంగా మార్చాలి

న్యూస్ వెలుగు, కర్నూల్; స్థానిక నాయకులు నౌషాద్ మాట్లాడుతూ రైల్వే స్టేషన్ ఆవరణలో అసాంఘిక శక్తులు తిష్ట వేస్తున్నారని, రాత్రి వేళ ప్రయాణికులు ఇళ్ళకు చేరుకోవటానికి భయబ్రాంతులకు గురవుతున్నారని , రైల్వే స్టేషన్ ప్రాగణం మొత్తం స్మశాన వైరాగ్యాన్ని తలపిస్తుందని , నడిబొడ్డులో ఉన్నటువంటి స్టేషన్ మొత్తం ఆవరణ మధ్యలో యాచకులు , సామాన్యులకు అసౌకర్యంగా ఉంటున్నప్పటికి సంబంధిత యంత్రాంగం నిమ్మకు నీరెత్తి నట్లు చోధ్యం చూస్తుండటం బాదాకరమని , నగర అభివృద్ధి ముసుగులో గత పాలకులు అభివృద్ధి పేరుతో వ్యాపారం చేసుకుంటూ కుటుంబం గడుపుకుంటున్న వ్యాపారస్థుల అంగడ్లు తొలగించి యాచాకులకు నిలయం గా మార్చారు , కర్నూలు నగరపాలక సంస్థ స్వచ్ భారత లో అవార్డు స్థాయికి చేరుకున్నప్పటికి ముంపుకు ఎక్కువ మురుగుకు తక్కువ అన్నట్టు పాలకుల శాపానికి నగరం బలైపోతున్నదని , కర్నూలు అభివృద్ధి నిమిత్తం వచ్చే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ నిధులను కైంకర్యం చేయటంపై వున్న శ్రద్ద అభివృద్ధిపై చూపలేక పోతున్నారని నౌషాద్ తీవ్రంగా విమర్శించారు..

Author

Was this helpful?

Thanks for your feedback!