
కర్నూలు వాసి ముసద్ది శివారెడ్డి కి డాక్టరేట్
కర్నూలు, న్యూస్ వెలుగు; మానవతా సంస్థ పూర్వ నగర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఎం. శివారెడ్డి సేవలకు గుర్తింపుగా అమెరికన్ యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ఇంటర్నేషనల్ హ్యుమన్ రైట్స్ సంస్థ. వారు సోషల్ సర్వీస్ కింద అమెరికన్ యూనివర్సిటీ వారితో కలిసి గౌరవ డాక్టరేట్ ను ఎంపిక చేశారు. పాండిచ్చేరిలో జరిగిన కార్యక్రమంలో శివారెడ్డికి అతిథులు పాండిచ్చేరి అసెంబ్లీ స్పీకర్ మరియు హెల్త్ మినిస్టర్ అమెరికన్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ లు డాక్టరేట్ ను ప్రదానం చేశారు. డాక్టరేట్ అందుకున్న శివారెడ్డికి మాన వత సంస్థ జిల్లా కన్వీనర్ మనోహర్ రెడ్డి, సభ్యులు పాటిల్ హనుమంతరెడ్డి, చింతపల్లి రామకృష్ణ, శోభన్ బాబు, ఐ.ఎం.స్వామి శుభాకాంక్షలు తెలిపారు. 
 
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar