పరిసరాల పరిశుభ్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత

పరిసరాల పరిశుభ్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత

 నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు

అట్టహాసంగా స్వచ్చ ఆంధ్ర -ఆ స్వచ్చ దివస్ కార్యక్రమం ప్రారంభం
  పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజల సహకారం అవసరం

కర్నూలు, న్యూస్ వెలుగు; నగరంలో స్వచ్ఛతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అన్నారు. శనివారం సి.క్యాంపు కూడలిలో నగరపాలక సంస్థ అధ్వర్యంలో ‘స్వచ్చ ఆంధ్ర – స్వచ్చ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమిషనర్‌తో పాటు పోలీసు రెండోవ బెటాలియన్ డిఎస్పీ మాహాబూబ్ బాష, పర్యావరణ నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిశోర్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా సి.క్యాంపు కూడలిలో మానవహారం నిర్వహించి, అందరిచే స్వచ్చ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వ్యాపారులకు అవగాహన కల్పించారు. అలాగే బి.క్యాంపు పాకెట్ పార్కులో స్వచ్ఛత పనులు నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలో ప్రతి నెలా మూడోవ శనివారం స్వచ్చ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగర వ్యాప్తంగా అన్ని సానిటరీ డివిజన్లలో శనివారం అట్టహాసంగా స్వచ్చ ఆంధ్ర – స్వచ్చ దివస్ కార్యక్రమాలను నిర్వహించినట్లు వెల్లడించారు. వ్యాపారులు తమ దుకాణాల వద్ద తప్పనిసరిగా చెత్తా కుండీలను ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలో 100% శాతం ఇంటింటి చెత్తా సేకరణ జరుగుతుందని, ప్రజలు ఎక్కడపడితే అక్కడ ఇంటి చెత్తా వేయకుండా, నగరపాలక వాహనాలకే అప్పగించాలని పేర్కొన్నారు. చెత్తా కుప్పలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు, స్వచ్చ కర్నూలు సాధనకు నగర ప్రజలంతా సహకరించాలని కమిషనర్ కోరారు.కార్యక్రమంలో ప్రజారోగ్యధికారి డాక్టర్ కె.విశ్వేశ్వర్ రెడ్డి, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, పారిశుద్ధ్య తనిఖీదారులు అనిల్ కుమార్, హుస్సేన్, ఆర్.రాజు, రమేష్, వలి, మునిస్వామి, లోకేష్, ఆంజనేయులు గౌడ్, మల్లికార్జున, శానిటేషన్ కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!