
రాష్ట్ర హ్యాండ్ బాల్ సంఘం కోశాధికారిగా రుద్రారెడ్డి
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్ స్పోర్ట్స్ విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ హ్యాండ్ బాల్స్ సంఘం ఎన్నికల్లో హ్యాండ్ బాల్ కర్నూల్ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న డాక్టర్ రుద్ర రెడ్డి నీ రాష్ట్ర హ్యాండ్ బాల్ సంఘం కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రుద్రా రెడ్డి ఎన్నిక పట్ల జిల్లా క్రీడా సంఘాల ప్రతినిధులు కేఈ జగదీష్ కుమార్, శ్రీనివాసులు,ఈశ్వర్ నాయుడు,అవినాష, శ్రీధర్ రెడ్డి లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రుద్ర రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర సంఘం నాయకులు తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనందదాయకం అన్నారు. రాష్ట్రంలో హ్యాండ్ బాల్ కీడుతో పాటు క్రీడాకారుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.
Was this helpful?
Thanks for your feedback!