
నిలిచిపోయిన క్లస్టర్ యూనివర్సిటీ నిర్మాణ పనులు పూర్తి చేయాలి
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూల్ సమీపంలో జగనాథ్ గట్టు పైన నిర్మిస్తున్న క్లస్టర్ యూనివర్సిటీ నీ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ బృందం భవనాల దగ్గరికి వెళ్లి సందర్శించి నిలిచిపోయిన భవనాలను పూర్తి చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. క్లస్టర్ యూనివర్సిటీ నిర్మాణాలలో జరిగిన అవినీతిపై విచారణ చేయించాలి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రంగప్ప అబ్దుల్లా మాట్లాడుతూ
2023-2024 విద్యా సంవత్సరానికి కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ బడ్జెట్రూ. 5,320. కొత్త కాంప్లెక్స్ నిర్మాణానికి బడ్జెట్ కేటాయించారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీకి సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలను ప్రధాన కళాశాలగా గుర్తించింది.
కళాశాల శ్రేష్ఠత మరియు దాని NAAC ‘A’ గ్రేడ్కు ఉన్నందున ఎంపిక చేయబడింది.
దక్షిణ భారతదేశంలోని కర్నూల్ జిల్లా కేంద్రంలో సిల్వర్ జూబ్లీ, కె వి ఆర్, ప్రభుత్వ పురుషుల కాలేజీలతో ఏర్పాటు చేసిన క్లస్టర్ యూనివర్సిటీ 2018 మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ విద్యా మౌలిక సదుపాయాల సంస్థ కాంట్రాక్టర్ కు అప్పగించింది. ఇందులో భాగంగానే సిల్వర్ జూబ్లీ 29.3 కోట్లు కె.వి.ఆర్ 11,22 ఫర్ మెన్ 14.04 కళాశాలలో రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్ పథకం (రూస) నిధులతో ఆయా కళాశాలలో అకాడమిక్ భవన్, లైబ్రరీ, హాస్టల్, త్రాగునీరు ఇతర అవసరాలకోసం ఖర్చు చేసిన ఆ భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి కారణం వాటికి పెయింటింగ్, ఎలక్ట్రికల్ పైప్ లైన్ కనెక్షన్లు నిలిపివేయటం.
గత ప్రభుత్వం 2019 నాటికి క్లస్టర్ యూనివర్సిటీ పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తాం అని చెప్పి అప్పుడు కరోనా వైరస్ కారణం చెబుతూ నాటి నుండి నేటి వరకు పూర్తి చేయలేకపోయింది. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీగా ఈ విషయంపై పలుమార్లు ఉపకులపతి సాయి గోపాల్ ప్రశ్నించగా పనులు పూర్తి కావస్తుంది అని చెప్పటం తప్ప చేసింది ఏమి లేదు మరోవైపు జగన్నాథ్ గట్టుపై అసంపూర్తిగా ఉన్న భవనాలు దర్శనమిస్తున్నాయి అవి ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి ఎస్ఎఫ్ఐ బృందం జగన్నాథ్ గట్టుపై నిర్మిస్తూ హాస్టల్ భవనాలు అకాడమిక్ బ్లాక్ లను సందర్శించినప్పుడు ఈ నిర్మాణం మధ్యలో ఆగిపోవడానికి కారణం నిధులలో సక్రమంగా కాంట్రాక్టర్ చెల్లించలేకపోవటం వల్ల అని తెలిసింది. ఇదే విషయంపై ఆరా తీస్తే నాకు ఇవ్వాల్సిన మొత్తం నిధులు చెల్లిస్తే నేను భవనాలు అప్పగిస్తాను అంటూ కాంట్రాక్టర్ చెబుతున్నారు అని తెలిసింది. మరో వైపు గత ప్రభుత్వ ఆర్థికశాఖ మంత్రి వీసీ రిజిస్టర్ కు తెలియకుండా దాదాపు 40 కోట్ల రూపాయల వరకు విత్ డ్రా చేసినట్లు ఆరోపిస్తూ డోన్ ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రి తీసుకెళ్లినట్టు సామాజిక మాధ్యమాలలో చెక్కలు కొడుతున్నాయి. ఏది ఏమైనా ఈ రాజకీయ క్రీడలో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎస్ఎఫ్ఐ గా భావిస్తున్నాము తక్షణమే ఈ నిర్మాణం పైన విచారణ కమిటీ వేయించి కాంట్రాక్ట్ రావాల్సిన డబ్బులు త్వరగా చెల్లించి రాబోయే విద్యా సంవత్సరంలోపైన ఈ భవనాలు పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి పిఎస్ఎన్ జిల్లా కన్వీనర్ అమర్ ఎస్ఎఫ్ఐ నగర నాయకులు మల్లేష్ పిఎస్ఎన్ నాయకులు మనోహర్ శంకర్ చింటూ తరుణ్ తదితరులు పాల్గొన్నారు