
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలు నాశనం చెయ్యొద్దు ; ఆప్టా
కర్నూలు, న్యూస్ వెలుగు; గత ప్రభుత్వం జి ఓ 117 ద్వారా రాష్ట్రం లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లను పూర్తిగా నాశనం చేసింది అనే విషయం అందరికీ తెలుసు. అట్టి ప్రభుత్వమే జి ఓ 117 కు సవరణ చేస్తూ ప్రాథమిక పాఠశాల లో 1:20 ఉపాద్యాయ విద్యార్ధి నిష్పత్తి దాటిన తర్వాత రెండవ టీచర్ పోస్టు ను ఇచ్చింది. ఐన గ్రామీణ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో నమోదు తగ్గి, ప్రవేట్ పాఠశాల దారి పట్టారు. జి ఓ 117 రద్దు చేసి మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం ఐన మరల ఫౌండేషన్ పాఠశాల పేరు తొ విద్యా హక్కు చట్టం పేరు చెప్పి 1:30 ఉపాద్యాయ విద్యార్ధి నిష్పత్తి ఏర్పాటు చేయడం దారుణం. దీని వలన మోడల్ స్కూల్ పరిస్థితి బాగున్న ఏకోపాధ్యాయా ప్రాథమిక పాఠశాలలు ఎక్కువ కావడం జరుగుతుంది. కాబట్టి ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాల లో కూడా 1:20 దాటిన తరువాత రెండో పోస్టు మంజూరు చేసి రాష్ట్రం లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కాపాడవలసింది గా రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి కి లేఖ ద్వారా ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు ఎ జి ఎస్ గణపతి రావు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు తెలిపారు