
పోలీస్ పరేడే మైదానంలో స్వాతంత్ర సమరయోధ కుటుంబ సభ్యులకు ఘన సన్మానం
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ వెలుగు; 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర సమరయోధ వారసులకు ఘన సన్మానం చేయడంతో వారు చేసిన త్యాగాలను తలుచుకోవడం ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.
ఆదివారం జిల్లా పోలీస్ పరడే మైదానంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా వందనం అనంతరం స్వాతంత్రంలో పాలు పంచుకున్న స్వాతంత్ర సమరయోధుల వారసులను జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకొని వారి జీవితాలను త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల వారసులను సన్మానించుకోవడం మన భాద్యత అన్నారు. సన్మానం పొందిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యుల వివరాలు:
1. గుర్రం జైపాల్ రెడ్డి s/o గుర్రం వెంకట్ రెడ్డి, కెవిఆర్ గార్డెన్, కర్నూలు
2. సర్దార్ బుచ్చిబాబు, s/o సర్దార్ నాగప్ప, నాగప్ప వీధి, కర్నూలు
3. . జి.సుబ్బమ్మ w/o జి.సత్య నారాయణ, కలే కరీం మస్జీద్ దగ్గర, కర్నూలు
4. ఎం.సి.ఎంకమ్మ, w/o ఎం.సి.శుభకర్, చిన్నా మార్కెట్, కర్నూలు.
5. ఎస్.డి.నాగేంద్ర ప్రసాద్, s/o ఎస్.డి.నారాయణ రావు, కర్నూలు టౌన్
6. డి.రాధాకృష్ణ మూర్తి, s/o డి.చెన్నయ్య, బాలాజీ నగర్, కర్నూలు.
7. ఎస్.ఐ.భాష బియబాని, s/o ఎస్ఎంకే.బియాని, జర్నలిస్ట్ కాలనీ, కర్నూలు
8. కల్నల్ ఐఎస్.సయీద్, శిల్పా సింగపూర్ టౌన్ షిప్, కర్నూలు*
9. కథం తుక్క చంద్రకాంత్, s/o.తుక్కోజి రావు, బండిమెట్ల, కర్నూలు
10. వీరిని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఇంఛార్జి జిల్లా ఎస్పీ హుస్సేన్ పీరా దుశాలువ మరియు పూలమాలతో సన్మానించారు.