
ధరల పెరుగుదలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
కర్నూలు, న్యూస్ వెలుగు; అఖిల భారత ప్రజాతంత్ర మహిలా సంఘం (AIDWA) దేశ వ్యాప్తంగా తమ ఆందోళనను రాష్ట్ర పతికి ప్రధానికి తెలియ చేస్తున్నది. మన రాష్ట్రంలో తగు చర్యలు తీసుకోవాలని కొరుతున్నాము.దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వలన ప్రజల జీవనం పై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితులు మహిళలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మహిళలు కేవలం కార్మికులు,కర్షకులు గానే కాకుండా కుటుంబ బాధ్యతలు నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక విధానాలు మరియు నియంత్రణలో పెనుమార్పులు పేద ప్రజలపై ఒత్తిడిని మరింత తీవ్రతరం చేశాయి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) మరియు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI)ల్లో నమోదైన పెరుగుదల ఈ పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. ముఖ్యంగా, ఆహార ఉత్పత్తులు, పెట్రోల్, గ్యాస్ వంటి అవసరమైన వస్తువుల ధరల పెరుగుదల వల్ల కుటుంబ ఖర్చులు సాధారణ ప్రజల ఆదాయాలను మించుతున్నాయి .జీఎస్టీ పేరుతో భారాలు మరింత పెంచారు.
అందువల్ల, మా ప్రధాన డిమాండ్లు:
1. అవసరమైన సరుకులను తక్కువ ధరలకు అందించుట:
ప్రభుత్వ పౌర సరఫరా వ్యవస్థ ద్వారా ఆహారధాన్యాలు మరియు ఇతర నిత్యావసర వస్తువులను తక్కవధరలకు (రైతుల దగ్గర కొన్న ధరలకు) అందుబాటులో ఉంచాలి.
నిల్వదారులపై నియంత్రణ మరియు అధిక ధరలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
2. ఉపాధి హామీ:
MNREGA పని రోజుల సంఖ్యను 200 రోజులకు పెంచి, కనీస వేతనాలను హామీని అమలు చేయాలి.
3. ఆరోగ్య రంగం:
ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు సబ్సిడీలను కొనసాగించాలి.ఆరోగ్యశ్రీ సేవలు కు నిధులు ఇవ్వాలి.ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగు చేయాలి.
4. విద్య:
విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి.బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
5. మహిళా స్వయం సహాయక బృందాలు:
బ్యాంకుల ద్వారా మహిళా స్వయం సహాయక బృందాలకు రుణాలను సులభతరం చేయాలి. పొదుపు డబ్బుల పై బ్యాంకు ల అక్రమ ఆంక్షలను తొలగించాలి.
అధిక ధరల నియంత్రణ కోసం మరియు ప్రజలపై భారాలు తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానం మేరకు కందిపప్పు,వంటనూనె తక్షణం అందరికీ అందించాలి. నగదు బదిలీ కాకుండా వాగ్దానం మేరకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించాలి. రేషన్ కార్డు ల లో పేర్లు తొలిగించి కొత్త కార్డులు ఇవ్వనందున చాలా సమస్యలు ఎదుర్కుంటున్నారు. కార్డుల లో అవసరమైన మార్పులు థ
చేయాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధరల నియంత్రణకు మరియు పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకునేవిధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాము. ఈ సమస్యపై మీ తక్షణ దృష్టిని మరియు కఠిన చర్యలను ఆశిస్తున్నాము. అనంతరం జిల్లా కలెక్టరు వినతిపత్రం అందజేయడం జరిగింది. కలెక్టర్ స్పందిస్తూ మీరు ఇచ్చిన విన్నపం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి N.అలివేలు,K. అరుణ,K.S పద్మ,G.ధనలక్ష్మి,P.S సూజాత,వేణి,శేఖన్, పాల్గొన్నారు.