కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ విభాగానికి తనిఖీ

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ విభాగానికి తనిఖీ

కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ విభాగంలో ఉండే లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్  ఓటి థియేటర్స్, జనరేటర్, తదితర విభాగాలకు సంబంధించిన అభివృద్ధి పనులకు తనిఖీ చేసినట్లు తెలిపారు.
క్యాన్సర్ విభాగంలో డేకేర్ కీమోథెరపీ ఐపీ పేషెంట్లకు చేస్తున్నట్లు తెలిపారు.
క్యాన్సర్ విభాగంలో బుధవారం  అల్ట్రా సౌండ్ మెషిన్ ను ఇన్స్టాలేషన్ ప్రాసెస్ పూర్తి చేసినట్లు తెలిపారు. లిక్విడ్ ఆక్సిజన్ మరియు ఆక్సిజన్ పైప్ లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు.క్యాన్సర్ విభాగంలో క్లీనింగ్ పనులు పూర్తయినట్లు తెలిపారు.క్యాన్సర్ విభాగంలో ఉన్న జనరేటర్ పనులు జరుగుతున్నాయని అన్నారు. అధునాతనమైన యంత్రాలతో త్వరలో క్యాన్సర్ పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమానికి ఆసుపత్రి CSRMO, డా.వెంకటేశ్వరరావు, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, డా.CSRK.ప్రకాష్, CSRMO, డా.హేమనలిని, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు, తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!