ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, ప్రాంతీయ రుణ విస్తరణ కార్యక్రమం

ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, ప్రాంతీయ రుణ విస్తరణ కార్యక్రమం

కర్నూలు, న్యూస్ వెలుగు; రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మన కర్నూలు జిల్లాలో 61 శాఖలతో రూ.5596 కోట్ల తో అధిక వ్యాపార వాటాను కలిగి ఉన్నదనీ, రుణాలలో రూ.2934 కోట్లతో అధిక వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ, అధిక పంట రుణాలు, స్వయం సహాయక బృంద రుణాలు, వివిధ రకాల వ్యాపార రుణాలను అందచేస్తున్నది అని తెలిపారు. ఈ రుణాలే కాకుండా గృహ, వాహన, వ్యక్తిగత, విద్య మరియు ఆస్తి తనఖా రుణాలు అతి తక్కువ వడ్డీతో త్వరిత గతిన రుణాలు మంజూరు చేయటం జరుగుతుందని, ఉద్యోగస్తులకు ప్రత్యేక రాయితీ కలదని, కావున ఈ అవకాశాన్ని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఖాతాదారులు మరియు ప్రతి ఒక్క వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. అంతేకాకుండా దీనిపై దృష్టి సారించేందుకు మన కర్నూలు జిల్లా లో మూడు సరళ రుణ కేంద్రాలను ప్రారంభించి అతి తక్కువ మరియు స్థిర వడ్డీ రేటుకే అత్యంత వేగంగా సరళ రుణ కేంద్రాల ద్వారా *రూ.10.00 లక్షలు, అంతకంటే పైబడిన రుణాలను త్వరితగతిన మంజూరు చేయుటకు ఏర్పాటు చేయడం జరిగినది. రోజువారీ తగ్గింపు బాలన్స్ పై మాత్రమే వడ్డీ విధింపు. ఋణం తీసుకున్న తేదీ నుండి చివరి వరకు వడ్డీ మరియు EMI పెంచడం జరగదు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 150 మంది ఖాతాదారులకు MSME రుణాలు రూ.6.75 కోట్లు మంజూరు చేయడం జరిగినది. నవీన్ కుమార్ మాట్లాడుతూ ప్రతిసంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ నెల నుండి ఇవాలిటీ వరకు 24 కోట్ల గృహ, వాహన, విద్య) రుణాలను అతితక్కువ వడ్డీ మరియు ఎటువంటి ప్రాసెసింగ్ చార్జీలు లేకుండా మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్యాంకు అందిస్తున్న అత్యుత్తమ రుణ పథకాలు వినియోగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో రీజినల్ మేనేజర్, వివిధ శాఖల బ్రాంచ్ మేనేజర్లు, బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!