రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు రెండేళ్లు వాయిదా వెయ్యాలి: బిల్డర్స్ అసోసియేషన్

రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు రెండేళ్లు వాయిదా వెయ్యాలి: బిల్డర్స్ అసోసియేషన్

కొనేవారు లేక నిలిచి తేపోయిన 1000భవనాలు వందల ఇళ్లకు టులెట్ బోర్డులు.PPSS

కర్నూలు, న్యూస్ వెలుగు; రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణరంగం సంక్షోభంలో పడి వడ్డీలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులతో బిల్డర్స్ ఉన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ పెంచడం భావ్యం కాదని కనీసం రెండేళ్లయిన వాయిదా వేయాలని బిల్డర్స్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రెటరీ బ్రిజేష్ సింగ్ జిల్లా రిజిస్టర్ చెన్నకేశవరెడ్డిని కోరారు. శుక్రవారం  ఉదయం బిల్డర్స్ అసోసియేషన్, పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం జిల్లా రిజిస్టార్ కి వినతి పత్రం ఇచ్చారు. మాట్లాడుతూ నిర్మాణరంగం సంక్షోభంలో ఉన్నందున బిల్డర్స్ తో పాటు వేలాది మంది వర్కర్స్ కూడా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైస్ మిల్లు యజమానుల సంఘం గౌరవాధ్యక్షులు ఆర్.వి బ్రహ్మయ్య, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, కే మధుసూదన్, బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ రాష్ట్ర అధ్యక్షులు ఎం యాకోబ్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా దాదాపు వేయి వరకు భవనాలు కొనేవారు లేక నిలిచిపోయాయన్నారు. కర్నూలు నగరంలో ఎన్నడూ లేని విధంగా వందలాది ఇళ్లకు టూలేట్ బోర్డులు కనిపిస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం అద్దె విలువ నుండి ఆస్తి విలువపై ఇంటి పన్నులు విధించే చట్టం తెచ్చింది. దీనివల్ల రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగినప్పుడల్లా ఇంటి పన్నులు కూడా పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్లు పెరగడం వల్ల కార్పొరేట్ సంస్థలు ఆస్తి విలువను చూపించి వందల వేల కోట్లు బ్యాంకుల నుండి అప్పు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుందని విమర్శించారు. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ బృందంలో బిల్డర్స్ గోరంట్ల రమణ, చంద్రమౌళి, పి పి ఎస్ ఎస్ నాయకులు సి వి వర్మ ఏ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. అభివందనములతో
ఇరిగినేని పుల్లారెడ్డి

Author

Was this helpful?

Thanks for your feedback!