ఏ ఒక్క విద్యార్థి నష్టపోకుండా, పాఠశాలలు అందుబాటులో ఉండేలా ప్రతిపాదనలు ఉండాలి

ఏ ఒక్క విద్యార్థి నష్టపోకుండా, పాఠశాలలు అందుబాటులో ఉండేలా ప్రతిపాదనలు ఉండాలి

      జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్ వెలుగు; ఏ ఒక్క విద్యార్థి నష్టపోకుండా, పాఠశాలలు అందుబాటులో ఉండేలా ప్రతిపాదనలు ఉండాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.. బుధవారం పాఠశాలల బలోపేతం – రీస్ట్రక్చరింగ్ అంశం పై కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో నియోజకవర్గ స్పెషల్ అధికారులతో, డిప్యూటీ విద్యాశాఖాధికారులతో, మండల విద్యాశాఖాధికారులతో కలెక్టర్ కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మండల విద్యా శాఖాధికారులతో మాట్లాడుతూ పిల్లలకు ఇబ్బందులు కలగకుండా రీస్ట్రక్చరింగ్ జరగాలని ఆదేశించారు..పాఠశాల విద్యా వ్యవస్థ బలోపేతం అయ్యేలా ప్రతిపాదనలను రూపొందించాలని సూచించారు..కర్నూలు, ఆదోని, పత్తికొండ నియోజకవర్గాలకు సంబంధించిన క్లస్టర్ల వారీగా పాఠశాలలు, విద్యార్థుల వివరాలను మండల విద్యా శాఖాధికారులను అడిగి తెలుసుకున్నారు..అవసరం ఉన్న చోట పాఠశాలలకు అప్రోచ్ రోడ్లు ఏర్పాటుకు ఎస్టిమేట్లు తయారు చేసి ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు… సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా విద్యా శాఖాధికారి శామ్యూల్ పాల్, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, డిఆర్డిఎ పిడి నాగశివలీల, డి పి ఓ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు..

Author

Was this helpful?

Thanks for your feedback!