
నాన్నకు ప్రేమతో చలివేంద్రం ఏర్పాటు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండలం చిన్నహ్యాట గ్రామం బీరప్ప (టీచర్) జ్ఞాపకార్థంగా నాలుగవ సంవత్సరం కుమారులు మాదాసి కురువ మదారి కురువ మండల ఉపాధ్యక్షుడు బసవ,నాగేంద్ర తండ్రి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాని ఆదివారం సబ్ ఇన్స్పెక్టర్ బాల నరసింహులు,సంఘం గౌరవ అధ్యక్షులు కాళికా ప్రసాద్,చిన్నహ్యట శేషగిరి,జడ్పీ వైస్ చైర్మన్ బావ శేషప్ప,ఎండీ హళ్లి సర్పంచ్ సుధాకర్,సంఘం రాష్ట్ర నాయకులు రామ్ మోహన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కన్వీనర్ కౌడికి రాజు,ఆలూరు తాలుక ప్రధాన కార్యదర్శి మల్లయ్య.తాలుక మాదాసి కురువ మండల సలహ దారుడు డాక్టర్ రామాంజనేయులు మండల అధ్యక్షలు పంపాపతి మాట్లాడుతూ వాల్మీకి సర్కిల్ దగ్గర చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఎంతోమంది ప్రయాణికులు,విద్యార్థులకు దాహం తీర్చడం కోసం తండ్రి జ్ఞాపకార్థంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున.సాయిభేష్,రాజా, సీఐటియు మండల కార్యదర్శి నాగరాజు,వేణు,ఎల్లప్ప,మంజు,ఆంజినేయ్య,నాగేంద్ర,ఘ్ననేశ్,లకమన్న,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.