
నేపాల్ ఉపగ్రహ ప్రయోగాని సహాయం చేయనున్న భారత్
నేపాల్ : మునల్ ఉపగ్రహ ప్రయోగానికి సహాయ సహకారాలు అందించడం కోసం భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) మధ్య ఆదివారం ఒక అవగాహన ఒప్పందం జరిగినట్లు అధికారులు తెలిపారు.
MEA నుండి JS (నార్త్) అనురాగ్ శ్రీవాస్తవ మరియు NSIL నుండి డైరెక్టర్ శ్రీ అరుణాచలం A ఈ ఎమ్ఒయుపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో నేపాల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (NAST) సెక్రటరీ డాక్టర్ రవీంద్ర ప్రసాద్ ధాకల్, నేపాలీ ఎంబసీకి చెందిన ఛార్జ్ డి అఫైర్స్ సురేంద్ర థాపా మరియు అంతరిక్చ్య ప్రతిషన్ నేపాల్ (APN) వ్యవస్థాపకుడు డాక్టర్ అభాస్ మాస్కీ కూడా పాల్గొన్నారు. .
Was this helpful?
Thanks for your feedback!