
కౌలు రైతు సమస్యలు పరిష్కరించాలి : మాబు పీర
న్యూస్ వెలుగు తుగ్గలి : కౌలు రైతుల సంక్షేమం కొరకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నాయకులు మాబు ప్రభత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని గల పలు గ్రామ సచివాలయాల అధికారులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను ఆంధిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ గ్రామాలలో గ్రామ సభలను నిర్వహించి అర్హత కలిగిన వారికి గుర్తింపు కార్డులు అందజేయాలని,కౌలు కార్డు పొందలేని రైతులకు కౌలు మిత్ర గ్రూప్ ఏర్పాటు చేసి వడ్డీ రాయితీ పంటలు అందజేయాలని,పంటలు దెబ్బతిన్న సందర్భాలలో భీమా పరిహారాలు, ఇన్పుట్ సబ్సిడీలు కౌలు రైతులకే అందించాలన్నారు. దేవాదాయ, ధర్మాదాయ భూములకు మరియు వక్ఫ్ భూములను సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వర్తింప చేయాలన్నారు. కౌలు రైతులు పండిస్తున్న పంటను ఈ క్రాప్ నమోదు చేసి ,ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా వేసులుబాటు కల్పించాలని, ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతులకు, కౌలు రైతులకు తక్షణమే ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు మండల కార్యదర్శి మాబు పీర, లాలన్న,కాశీనాథ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.